రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గంలోని అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేస్తోందన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
Tags; Distribution of electric stoves and cookers to Anganwadi centers