July 4, 2026
Explore
హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. హామీ నెరవేర్చిన ఏపీ ప్రభుత్వం

హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. హామీ నెరవేర్చిన ఏపీ ప్రభుత్వం

July 4, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 333 మందికి రూ.లక్ష సాయం అందిందన్న హజ్ కమిటీ చైర్మన్

సీఎం చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చారని వెల్లడి

మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారన్న చైర్మన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన 333 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు.

Tags: Rs 1 lakh aid for Hajj pilgrims: AP government fulfills its promise.