అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి డా. కె. సుబ్రహ్మణ్యం కలికిరి మండలంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, మొక్కల పెంపకం, ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: District Educational Officer at the environmental protection rally.