June 21, 2026
Explore
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

June 21, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు హైదరాబాద్‌లోని షేక్‌పేట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ అన్నే శ్రీనివాసరావు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.ఈ మేరకు విరాళానికి సంబంధించిన డిడిని ఆదివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కు అందించారు.ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన దాత అన్నే శ్రీనివాసరావును ఈవో అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు ఎన్. సదాశివరావు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:Rs. 1 crore donation to SV Pranadana Trust