పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డు సచివాలయాలలోను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేడేటాపై శుక్రవారం సచివాలయాలలో గ్రామ సభలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో 16 సచివాలయాల పరిధిలోను ఆయా ప్రాంత ప్రజలతో సమావేశం నిర్వహించి, డేటాపై వివరాలు సేకరించారు. దీనిపై శనివారం నుంచి వివరాలు సేకరించి, తప్పుఒప్పులను సరిదిద్ధే కార్యక్రమాన్ని ఈనెల 24 వ తేదీ వరకు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తమకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కమిషనర్ కోరారు.
Tags: Gram Sabhas in Secretariats