పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మార్కెట్ కమిటి ఆవరణంలో రైతు బజారు నిర్మాణానికి ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసినట్లు కమిటి చైర్మన్ సమీపతి యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్ కమిటిలో రైతు బజారు లేకపోవడంతో రైతులు, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిపై తన వినతి మేరకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించామని , త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
Tags: Rs. 28 lakh for Rythu Bazar construction