చిత్తూరుముచ్చట్లు:
గుంతకల్లు రైల్వే డివిజన్లో కమర్షియల్ విభాగం RS-2/CTO హోదాలో పనిచేస్తున్న కె. జ్యోతిని సస్పెండ్ చేశారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులపై చెప్పుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆరోజే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Tags: Railway official hits passenger with a slipper.