పుంగనూరు ముచ్చట్లు:
భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం రెండు వైద్యశిబిరాలు నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు మధుసూదన్ ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్కుమార్ కొత్తయిండ్లు హైస్కూల్, మేలుపట్ల హైస్కూల్ల్లో క్యాంపులు నిర్వహించారు. 55 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి, చికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ సమన్వయకర్త హేమలత, సభ్యులు రఘుపతి, దీనదయాల్, ఇందిరాప్రియదర్శిని, వాసు తదితరులు పాల్గొన్నారు.
Tags: Medical Camps