కేరళ ముచ్చట్లు:
ఎన్నికల వాగ్దానం ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ‘ప్రియదర్శిని’ పథకం అమలు కానుంది. కేఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ బస్సులకు ప్రత్యేక స్టిక్కర్లు అంటిస్తారని, ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు.
Tags;Free bus travel for women in Kerala.