శబరిమల ముచ్చట్లు:
మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఈ రోజు తెరుచుకోనుంది. తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో మేళ్ శాంతి ప్రసాద్ సాయంత్రం గర్భగుడి తలుపులు తెరుస్తారు. జూన్ 19వ తేదీ వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. అనంతరం తలుపులు మూసివేస్తారు. భక్తులు ఆన్లైన్ ద్వారా వర్చువల్ క్యూ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.
Tags; Special prayers at Sabarimala