విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నంకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలోని 200 రోజుల రికార్డును కేవలం 92 రోజుల్లోనే అధిగమించారు. మైనస్ 60 డిగ్రీల చలి, ఆహార లేమి వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొని రష్యా నుంచి అంటార్కిటికా వరకు సాగిన ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించారు.
Tags: Anmish sets world record