సత్తెనపల్లి ముచ్చట్లు:
సత్తెనపల్లి–అచ్చంపేట రహదారిలోని రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం జరిగింది.
స్థానికుల సమాచారంతో 108 వాహనంలో అతడిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం రైల్వే పోలీసులు విచారణ చేపట్టి, క్షతగాత్రుడిని తెనాలికి చెందిన పాముల ఆనంద్ (23)గా గుర్తించారు.
ఈ ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రాజమోహనరావు తెలిపారు.
Tags: Youth critically injured after being hit by a train near Sattenapalli.