June 11, 2026
Explore
శ్రీవారి భక్తసేవకు వచ్చే వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై జేఈవో డా. ఎ. శరత్ పరిశీలన

శ్రీవారి భక్తసేవకు వచ్చే వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై జేఈవో డా. ఎ. శరత్ పరిశీలన

June 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు.

ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో వశిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి గృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సేవలందించే విధంగా వసతి గృహాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈలు మనోహరం, వేంకటేశ్వర్లు, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, బర్డ్ సూపరింటెండెంట్ వెంకట రెడ్డి, టీటీడీ మరియు స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు.

Tags:JEO Dr. A. Sarath inspects accommodation facilities for medical professionals volunteering to serve the Lord’s devotees.