తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 86,124 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 41,520 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.51 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Tags: Devotees who visited Lord Srivaru at Tirumala