మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి మండలం, మాలేపాడు లో బుధవారం దారి సమస్య మళ్లీ మొదలైంది. టిడిపిలోని రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో వారు ఒకరిపై మరొకరు పోటీపడి 13 పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారిని చెట్ల మొద్దులు, ముళ్ళకంపలు రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలను స్తంభింప చేశారని అక్కడి గ్రామాల బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి రోడ్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: The Road Problem in Malepadu