పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లీటరసి అండ్ న్యూమరసి శిక్షణా తరగతులు 6 రోజులు జరగనున్నాయి. శుక్రవారం ప్రారంభమైన తరగతులకు పుంగనూరు మున్సిపాలిటితో సహా చౌడేపల్లె, సోమల, సదుం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్లు శిక్షణకు హాజరైయ్యారు. కానీ ఉపాధ్యాయులు ఫోన్లలో మాట్లాడటం,వెనక్కు తిరిగి, పక్కన ఉన్న వారితో కబుర్లు చెప్పుకోవడం జరిగింది. ఇక శిక్షణ ఎవరికోసమో అంటు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కాలక్షేపానికి వచ్చినట్లు స్పష్టమౌతున్న దృశ్యమిది.
Tags; Why are they being trained…?