పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయం, తూర్పువెహోగసాలలో గల శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే చాముండేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి అమ్మవార్లకు నెయ్యిదీపాలు, నిమ్మకాయ దీపాలు, చల్లముద్ద పెట్టి , పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Tags: Prayers at the temples of Sri Maremma and Chamundeshwari Devi.