న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కౌన్సెలింగ్ గడువు ముగిసినా ఏపీలో 246, తెలంగాణలో 377 సీట్లు భర్తీ కాలేదని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. విద్యార్థులు సిద్ధంగా ఉన్నా గడువు పొడిగించలేదని తెలిపాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.
Tags:Filling of Medical PG Seats in Telugu States: Colleges Approach Supreme Court