- రామసముద్రం ముచ్చట్లు:
- సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పింపు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, పుత్తూరు ఎస్డీపీవో పర్యవేక్షణలో వడమాలపేట మండలం రామసముద్రం గ్రామంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, ఆన్లైన్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- అలాగే మహిళలు ఎటువంటి సమస్యలు ఎదురైన వెంటనే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని, మహిళల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. గ్రామ స్థాయిలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మహిళల్లో ధైర్యం మరియు భద్రతపై నమ్మకాన్ని పెంచుతాయని అధికారులు పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని స్థానిక పోలీసులు సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.
Tags: Organization of an awareness program on women’s safety.