తిరుపతి ముచ్చట్లు:
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంవరకు ఘనంగా నిర్వహించారు.
ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tags: Koyil Alwar Thirumanjanam Celebrated Grandly at the Venkateswara Swamy Temple