అమరావతిముచ్చట్లు:
47 డిగ్రీల టెంపరచర్ తో నాట్ ఔట్ గా ఉంటూ- నిప్పుల కొలిమిగా ఏపీ – విజయవాడలోనే 10 మంది మృతి – యాచకులే ఎక్కువ
రాష్ట్రాన్ని ఎండలు దహించి వేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నగరంలోనే పది మంది మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో ఎక్కువమంది గుర్తు తెలియని యాచకులే.
ఏలూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు
కాకినాడ జిల్లాలో ముగ్గురు చనిపోయారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు.
Tags: The blazing sun…