ఎందరి మాతృ మూర్తులకు కడుపుకోత మిగిల్చింది!
వేసవి సెలవులు కావడంతో గుడికి వెళ్లిన కుటుంబం ప్రమాదవశాత్తు ఆలయ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి
జగిత్యాల ముచ్చట్లు:
మేడిపల్లి మండలం కొండాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఆలయ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
కొండాపూర్ శివగంగ వద్ద మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు వెళ్లారు.
ఈ క్రమంలో అడుకుంటూ ప్రమాదవశాత్తు కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు షార్వింద్(7), మనస్వి (9), మన్వీత్(11) గా గుర్తించారు.
చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags; Summer Holidays Bring Tragedy to Families