వామ్మో మరీ ఇంత దారుణమా…. తన కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడని.. యువకుడిని దారుణహత్య చేసిన వైనం!
మార్కాపురం ముచ్చట్లు:
యర్రగొండపాలెంలో దారుణం చోటుచేసుకుంది.
ఈ నెల 13న అదృశ్యమైన ఆంజనేయులు అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
ఆంజనేయులును వెంకట నారాయణ, రమణ దంపతులు చంపేసి..,
మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
తమ కూతురితో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించారు.
ఈ మేరకు దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags: Young Man Brutally Murdered