విజయనగరంముచ్చట్లు:
విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ పై మంగళవారం రాత్రి షేక్ గౌస్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో దాడి చేశాడు. సాలూరు కు చెందిన గౌస్ విజయనగరం కు చెందిన మహిళను నాలుగేళ్ళ క్రితం వివాహమాడాడు. ఇద్దరు పిల్లలున్న గౌస్ కుటుంబం లో కలహాలు రావడంతో మహిళా స్టార్ సిబ్బంది గౌస్ భార్య ను స్టేషన్ కు పిలిచించారు. ఆ రాత్రే గౌస్ సరాసరి మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చి రావడంతోనే ఒక బాటిల్ తి పెట్రోల్ తీసుకుని ఆ పై మద్యం సేవించి స్టేషన్ పై దాడి చేశాడు. స్టేషన్ లో రిసెప్షన్ వద్ద, ఎస్ఐ రూమ్ గోడపై పెట్రోల్ పోసి నిప్పంటించబోతుండగా స్టేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఎస్ఐ లక్ష్మీ ప్రసన్న కుమార్ వచ్చి గౌస్ ని అదుపులో కి తీసుకున్నారు.
Tags:Attack on Women’s Police Station with a Petrol Bottle.