పీలేరు ముచ్చట్లు:
పీలేరు పట్టణంలో సోమవారం నకిలీ రూ.100 నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఓ వ్యక్తి జాతీయ బ్యాంకులో నగదు డిపాజిట్ చేయగా, అందులో కొన్ని రూ.100 నోట్లు నకిలీవిగా మిషన్ గుర్తించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొందరు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని సమాచారం.
Tags: Counterfeit Currency Scare in Pileru