న్యూయార్క్ ముచ్చట్లు:
న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక ‘మెటాలా’ ఫ్యాషన్ ఈవెంట్లో భారతీయ వ్యాపారవేత్త సుధారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ థీమ్తో మనీష్ మల్హోత్రా రూపొందించిన తెలంగాణ వస్త్రశైలి దుస్తుల్లో ఆమె మెరిశారు. ముఖ్యంగా రూ.126 కోట్ల విలువైన 550 క్యారెట్ల ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ నెక్లెస్తో ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆశ్చర్యపరిచారు. వ్యాపార రంగంతో పాటు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Tags: Indian art on the world stage