పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు ఎంఈవో నటరాజారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక బసవరాజ హైస్కూల్ల్లో ఎంఈవోలు నటరాజారెడ్డి, రెడ్డెన్నశెట్టి ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులు నిర్వహించి, విద్యార్థులకు పాఠ్యాంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 25 వరకు క్లాసులు నిర్వహిస్తామన్నారు. 25న సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమౌతుందని తెలిపారు. ఈ తరగతులకు విద్యార్థులను తప్పకుండ పంపాలని ఎంఈవోలు కోరారు.
Tags: Special Training for 10th Grade Students