May 2, 2026
Explore
పోటీ ప్రపంచంలో లక్ష్య సాధన వరకు పట్టుదలతో కృషి

పోటీ ప్రపంచంలో లక్ష్య సాధన వరకు పట్టుదలతో కృషి

May 2, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అభినందించారు.

ఈ విజయాన్ని ఒక మొదటి మెట్టుగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన ప్రత్యేక చర్యలతో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.

విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు.

పోటీ ప్రపంచంలో ముందుండేందుకు లక్ష్య సాధన వరకు పట్టుదలతో కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

Tags: In a competitive world, work with perseverance until the goal is achieved.