పెద్దపల్లి ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కలు పీక్కుతినడంతో మూడేళ్ల చిన్నారిని మృతి చెందింది. ఇంటిముందు ఆడుకుంటున్న దివ్యా బెహ్రా అనే బాలికపై కుక్కలు దాడి చేశాయి. ఆమెను నోట కరుచుకుని పొల్లాల్లోకి ఈడ్చుకెళ్లాయి. ఈక్రమంలో కుక్కలు పీక్కుతినడంతో తీవ్రగాయాలతో మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు.
Tags: Stray Dogs Maul Three-Year-Old Child