ఒడిశా ముచ్చట్లు:
నాదెండ్ల మండలం, గణపవరంలోని ఒక స్పిన్నింగ్ మిల్లు వద్ద ఈ ఘటన జరిగింది.ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రసాద్దాస్ పంతులు (36) అనే కార్మికుడు, అదే మిల్లులో పనిచేస్తున్న మరో కుటుంబానికి చెందిన బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఆదివారం సాయంత్రం బాలికను మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో, ఆగ్రహించిన తోటి కార్మికులు ప్రసాద్దాస్ పంతులుకు దేహశుద్ధి చేసి, ఒంటిపై కాల్చి వాతలు పెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags: This incident occurred at a spinning mill.