ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో హెజ్బొల్లాపై దాడుల నిలిపివేత
దశాబ్దాల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల చర్చలు
దక్షిణ లెబనాన్లో 642 మంది భారత శాంతి సైనికులు
ఇరాన్ ముచ్చట్లు:
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో పెరిగిన ఘర్షణలను తాత్కాలికంగా చల్లార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్లతో తాను మాట్లాడిన తర్వాతే ఈ అంగీకారం కుదిరిందని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడంతో లెబనాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ కాల్పుల విరమణతో ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేయనుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా కూడా దాడులు జరపకుండా సంయమనం పాటిస్తేనే ఈ ఒప్పందం నిలబడుతుంది.
ఈ ఒప్పందానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. 1980ల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే తొలిసారి.
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2,000 మందికి పైగా మరణించగా, పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కాగా, దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో 642 మంది భారత సైనికులు కూడా సేవలందిస్తున్నారు. ఈ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: Ceasefire between Israel and Lebanon… Trump announces.