లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలంలో బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటన కలకలం రేపింది. దప్పేపల్లి పంచాయతీ మేడిమాకుల గుంత గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న బాలికను కోనంపేటకు చెందిన సాయికుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోల్కొండ శోభ పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags: Incident of Assault on Girl Sparks Outrage