April 11, 2026
Explore
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..

సింగర్ మంగ్లీపై కేసు నమోదు..

April 11, 2026 | Andhra Pradesh

ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

తెలంగాణ ముచ్చట్లు:

ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసం చేశారని సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు ఓ న్యాయవాది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఏం జరిగిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఆమెతోపాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని.. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఆరోపించారు. అయితే కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడినట్టు పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదులో వెల్లడించారు న్యాయవాది సుబ్బరావు.

తనను యాక్సిడెంట్ చేసి చంపుతానని మంగ్లీ , ఆమె సోదరుడు బెదిరించినట్టు పోలీసులకు తెలిపారు. తనకు వీరితో ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో ఏ5 గా మంగ్లీ, మిగతా నిందితుల పై కేస్ నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

Tags; Case registered against singer Mangli.