పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామిని శుక్రవారం హంసవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వతి, పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారతులు ఇచ్చి , పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Sri Someswara Swamy on the Swan Vehicle