అమరావతిముచ్చట్లు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.05 గంటలకు స్థానిక రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటిస్తారు. అనంతరం 02.40 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 05.40 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.
Tags: CM to visit Nandyal district today, distributes land title passbooks to farmers