September 18, 2026
Explore
చెరువులో నీరు లేక.. వినాయకుడికి నిమజ్జన కష్టాలు

చెరువులో నీరు లేక.. వినాయకుడికి నిమజ్జన కష్టాలు

September 18, 2026 | Andhra Pradesh

కరకమందలో నిమజ్జనానికి నోచుకోని గణనాథుడి విగ్రహాలు

చెరువు వద్దే విగ్రహాలను వదిలి వెళ్లిన భక్తులు

సోమల ముచ్చట్లు:

వినాయక చవితి వేడుకలు ముగియడంతో గణనాథుడి విగ్రహాల నిమజ్జనానికి నీరు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమల మండలం కరకమంద గ్రామంలో చెరువులో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులు విగ్రహాలను చెరువు వద్దే ఉంచి వెనుదిరిగారు.

గ్రామంలో వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో గురువారం నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుని విగ్రహాలను చెరువు వద్దకు తీసుకెళ్లారు. అయితే చెరువులో సరిపడా నీరు లేకపోవడంతో నిమజ్జనం సాధ్యం కాలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సాధారణంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను వినియోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరకమంద చెరువులో నీరు లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు తెలిపారు. విగ్రహాలను చెరువు వద్దే వదిలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Tags: Lack of water in the tank… challenges for Vinayaka immersion.