పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండ్లో గల శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం అమావాస్య, రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. గుమ్మిడికాయలు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి దిష్టినివారణ పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు , చల్లముద్ద పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
Tags: Amavasya rituals at the Sri Maremma Temple.