అమరావతిముచ్చట్లు:
ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది.
ఈ పథకం ద్వారా ఎలాంటి వయస్సు లేదా కుటుంబ పరిమితి లేకుండా చికిత్సను పొందవచ్చు.
ఈ పథకం కింద 1700లకు పైగా వైద్య సేవలను, ఇప్పటికే ఉన్న వ్యాధులను కూడా కవర్ చేస్తుంది.
అర్హులు ఆన్లైన్లో లేదా CSC కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తమ అర్హతను తనిఖీ చేసి, ఆధార్ ఆధారిత ధృవీకరణతో కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కార్డుతో ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందవచ్చు.
Tags: Ayushman Bharat… Free medical treatment up to ₹5 lakh.