పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేసినట్లు సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు జెన్యూటౌన్ నుంచి యూఎన్ఆర్ సర్కిల్ మీదుగా మదనపల్లెకు వెళ్లాలన్నారు. అలాగే మదనపల్లె నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ సర్కిల్ , కోర్టురోడ్డు ఆర్టిసి బస్టాండ్ మీదుగా చిత్తూరు వెళ్లాలన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది కలగకుండ ట్రాఫిక్ మళ్ళించే కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుందన్నారు.
Tags: Traffic diversion on the 10th