పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం ఎంఆర్పిఎస్, ఎంఎస్పి నూతన కమిటిలను సోమవారం ఎన్నుకున్నారు. ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా తోమరం నరసింహులు మాదిగ, అధికార ప్రతినిధిగా గడాల గంగులప్ప లు నియమితులైయ్యారు. ఎంఎస్పి మండల అధ్యక్షుడుగా రంకుపల్లె బాబు, అధికార ప్రతినిధిగా మంచూరి విజయ్కుమార్ లు ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అన్నమయ్య జిల్లా ఎంఎస్పి ఇన్చార్జ్ కొట్టం సంజీవ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల , బలహీన వర్గాల అభ్యున్నతికి ఉధ్యమాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: Election of New Committee for MRPS and MSP