పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వెలసియున్న శ్రీకాశీవిశ్వేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్బయ్య దీక్షితులు పాలు, పెరుగు, తెనె, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేశారు. రుద్రనమక, చమక మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి వెహోక్కులు చెల్లించుకున్నారు.
Tags: Special prayers for Sri Kasi Visweswara Swamy