పుంగనూరుముచ్చట్లు:
అతివేగంగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని యూఎన్ఆర్ సర్కిల్ వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బైపల్లెకి చెందిన కె.సుధాకర్(35) పట్టణంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ తిరుగు ప్రయాణంలో యూఎన్ఆర్ సర్కిల్ వద్ద అతివేగంగా ఎదురుగా వచ్చిన ఆటో ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Two-wheeler rider dies after being hit by an auto-rickshaw.