ఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ-అహ్మదాబాద్ మార్గంలోని స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ ప్రెస్ లో IRCTC అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నాసిరకం దినుసులను గుర్తించారు. దీంతో కాంట్రాక్టర్కు రూ.10 లక్షల జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక బృందాలను కూడా నియమించారు.
Tags:IRCTC takes strict measures regarding food quality.