పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కృష్ణాపురానికి చెందిన రాధా (35) పై దాడి చేసిన సురేష్, శివ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కెవి.రమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సొంత పనుల నిమిత్తం బస్టాప్లో ఉన్న రాధా పై అదే గ్రామానికి చెందిన సురేష్, శివ లు పాతకక్షలతో ఆమెను కాళ్లతో తన్ని, కొట్టి గాయపరిచి దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Tags: Assault on woman – Case registered