తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి వీధిలోని మిరాశీ మణియందారు ఇంట్లో వృద్ధురాలు 24.08.2026, సోమవారం మృతిచెందారు.
వారి అంతిమ సంస్కారాల అనంతరం, 26.08.2026న ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు శ్రీ అమ్మవారి సన్నిధిలో ఏకాంతంగా పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
అనంతరం మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Tags: Private performance of Punyahavachanam in the presence of the Goddess.