August 24, 2026
Explore
59 గ్రాముల బంగారు నెక్లెస్‌ చీటింగ్..

59 గ్రాముల బంగారు నెక్లెస్‌ చీటింగ్..

August 24, 2026 | Andhra Pradesh

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

  • ప్రొద్దుటూరు వన్ టౌన్ లో నలుగురిపై కేసు నమోదు
  • బంగారు నెక్లెస్‌ తయారు చేయించుకుంటామని నమ్మించి 59 గ్రాముల బంగారు నెక్లెస్‌ను తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
  • పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధికి చెందిన షేక్‌ సద్దాం బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మహేష్‌ అనే వ్యక్తి స్నేహితుడు. మహేష్‌ తన స్నేహితులైన జగదీశ్‌, సుజిత్‌లను సద్దాంకు పరిచయం చేసి, వారు నమ్మకమైన వ్యక్తులని చెప్పాడు.
  • జగదీశ్‌ భార్యకు నెక్లెస్ చూపించి అదే మోడల్‌లో నెక్లెస్‌ తయారు చేయించుకుంటాడని.. సద్దాం వద్ద ఉన్న నెక్లెస్‌ను ఇవ్వాలని అడిగారు.
  • ఈ క్రమంలో ఖాజీపేటలో ఉన్న జగదీశ్‌ భార్య మనిమాలతో సద్దాం మాట్లాడగా, ఆమె కూడా నెక్లెస్‌ను పంపమని చెప్పింది.
  • దీంతో మహేష్‌, జగదీశ్‌, సుజిత్‌, మనిమాల మాటలను నమ్మిన సద్దాం 59 గ్రాముల బంగారు నెక్లెస్‌ను జగదీశ్‌కు ఇచ్చాడు.
  • తర్వాత ఎన్ని సార్లు అడిగినా జగదీష్ డబ్బుగాని, నెక్లెస్ గాని ఇవ్వలేదు
  • దీంతో నలుగురు కలిసి పథకం ప్రకారం నెక్లెస్‌ను తీసుకుని మోసం చేసినట్లు సద్దాం ఫిర్యాదులో

Tags: Fraud involving a 59-gram gold necklace…