పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ఈడిగపల్లెలోని బిఎస్ఎన్ఎల్ టవర్కు అమర్చిన బ్యాటరీలు దొంగతనంకు గురైనట్లు డీఈఈ శ్రీనాథ్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50 వేలు విలువ చేసే బ్యాటరీలు దొంగతనం జరిగినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ రామాంజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: Battery theft