కర్ణాటక ముచ్చట్లు:
మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధు దుర్మరణం..కర్ణాటకలో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణానికి చెందిన మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడు కంచర్ల మధుగా చింతామణి పోలీసులు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో మధు మరణించిన సమాచారాన్ని కుటుంబీకులకు చేరవేశారు. మృతుని కుటుంబీకులు వెంటనే కర్ణాటకకు వెళ్లారు. మదనపల్లె ప్రాంతంలో కంచర్ల శ్రీనివాసులు నాయుడు అందరికి సుపరిచితుడు.
Tags: Tragic death of Kancharla Madhu…