మార్కాపురం ముచ్చట్లు:
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపగా, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Tags: Minister Mandipalli Expresses Shock over Markapuram Bus Accident