అమరావతిముచ్చట్లు:
వంట గ్యాస్ (LPG) వినియోగదారులు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఆగస్టు 16తో గడువు ముగియనుంది. వినియోగదారులు గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ ఆధారిత యాప్స్ ద్వారా మీ ఫోన్లోనే ఈ-కేవైసీ చేసుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తిని సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా లేదా దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి నేరుగా వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ చేసుకోకపోతే సబ్సిడీ ధరలో సిలిండర్ పొందడంలో ఇబ్బందులు రావచ్చు.
Tags: The deadline for e-KYC is only until the 16th of this month.